మన కథకులు (my notes) – తిలక్ (1)

దేవరకొండ బాలగంగాధర తిలక్ (ఆగస్ట్ 1921 – జులై 1961)

ఊరి చివరి ఇల్లు (1)

కథల్ని నేను స్థూలంగా రెండు రకాలుగా విభజించుకుంటాను. issue-based and feeling-based అనేవి ఈ రెండు రకాలు. మానవ జీవనానికి సంబంధించిన ఏదో ఒక సమస్య చుట్టూ తిరుగుతూ, ఆ సమస్యను ఏదో ఒక కోణం నుంచో లేక పలు కోణాలనుంచో చూసి విశ్లేషిస్తూ నడిచి, అవసమయ్యుంటే, ఇవ్వగలిగుంటే, రచయిత చూపగలిగుంటే చివరికి ఒక పరిష్కారాన్ని చూపుతూ ముగిసే కథలు మొదటి రకానివి. మానవ హృదయానికి సంబంధించిన బాధలను, భావోద్రేకాలనూ మనసుకు హత్తుకునేలా చూపుతూ, కథ ముగిసేటప్పటికి ఒక pleasant feeling ని గానీ లేదా painful feeling ని గానీ మిగిల్చే కథలు రెండో రకానివి. తిలక్ గారి ‘ఊరి చివరి ఇల్లు’ ఈ రెండవ రకానికి చెందిన కథ.

పూర్వ కాలం నుంచీ పురుషుడు స్త్రీ అనే భావనను సౌందర్యానికి ముడివేసి చూసుకున్నట్లుగానే, వేశ్య అనే భావనను సాధారణ స్త్రీలకంటే తెలివిగలదిగానూ, సంభాషణాచతురురాలుగానూ, sensitive at heart గానూ ఊహించి చూసుకోవడానికే ఎక్కువ ఇష్ట పడ్డాడనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతారో లేదో చెప్పలేను గాని, గురజాడ గారి కన్యాశుల్కంలోని మధురవాణి ఆధునిక తెలుగు సాహిత్యంలో అప్పటినుంచి ఇప్పటిదాకా నిలిచివున్న అలాంటి ఒక వేశ్య పాత్ర. (గురజాడ గారి కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి ఒక insignificant, ప్రాముఖ్యమేమీ లేని పాత్ర; రెండువ కూర్పులో గురజాడ గారిచే బాగా విస్తరింపబడి ఇప్పుడున్న స్థాయికి చేరిన పాత్ర). తెలుగు సాహిత్యంలో మధురవాణి  ప్రభావం ఎంతటిదంటే, ఈమె చేత తెలుగు ప్రముఖ సాహిత్యకారులలో చాలామందిని సరదాగా imaginary interview లు కూడా చేయించడం జరిగింది. ‘ఊరు చివరి ఇల్లు’ లో రమ, sensitive heart తో వున్న ఒక, వేశ్యగా మార్చబడడానికి సిధ్ధం చేయబడుతున్న, యువతి పాత్ర!

‘ఊరి చివరి ఇల్లు’ మొదటి నుంచీ ఒక above from the normal or different from the normal వాతావరణంలో నడిచే కథ. అసలు కథకు ఆ పేరు పెట్టడంలోనే రచయిత తాను అనుకున్నది సాధించాడని, సాధారణ ఊరికి దూరంగా (ఇక్కడ దూరం అనేది physical దూరం అనే దానికంటే  – psychological – ఊహలలో దూరం అనేది గుర్తుంచుకోవాలి) ఒక different locale ని set చేయడంలో సఫలీకృతుడయ్యాడని నేననుకుంటాను. ఈ ఒక్క మాటతో పాఠకుని చిత్తాన్ని ఊరికి దూరంగా ఎక్కడికో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి కూర్చో బెడతాడు రచయిత. అలాగే, కథ మొదలయ్యే మొదటి వాక్యంతోనే కథకు కావలసిన ఒక mood ని set చేసి, పాఠకుడి చిత్తాన్ని ఊరుకు చివర, ఒక వర్షపు వాతావరణంలో కూర్చోబెడతాడు. కథనంలో ఒక చోట ‘ఆ ఇల్లు అక్కడ ఎందుకుందో ఎవరికీ తెలియదు’ అనే explanation కూడా ఇస్తాడు. This explanation serves as a hint, a message to the reader, to not to think more than what he says in the story and not to go deep into reasoning! ఈ hint తోనూ, message తోనూ, పాఠకుడు ఇంక extra thinking మానేసి, కథతో నిలిచి వుండి, కథను నడవనిస్తూ, తనుకూడా కథతో నడుస్తాడు. ముందు పేరాలలోనే ఈ message ఇవ్వడం అవసరం అనేది తిలక్ గారికి తెలుసు. ఎందుకంటే, ఈ కథను strict reasoning తో చదవడం మొదలెడితే, ముందుకు సాగదనీ, ఈ కథలో తాను చెప్పదలుచుకున్న, నిరూపించదలుచుకున్న విషయానికి, reasoning తో పని పెడితే కుదిరే విషయం కాదనీ తిలక్ గారు కథకునిగా ముందుగానే ఊహించారని నేననుకుంటాను!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-2

నన్ను గురించి కథ వ్రాయవూ? – (2)

కథలో ‘నేను’. కథ మొదటినుంచీ కుముదంలో ఏ ప్రత్యేకతా లేదంటూనే, కుముదం ను ఎప్పుడుచూసినా  కనులకు ఉత్ప్రేక్షలనే అద్దాలను తగిలించుకుని తప్ప చూడడు; కుముదం గురించి ఏది చెప్పినా ఉత్ప్రేక్షలనే అలంకారాన్ని జతచేసి తప్ప చెప్పడు. ఇది ఒక వైరుధ్యం. కథ మొదలు నుంచి చివరంటా సాగే వైరుధ్యం.

కుముదాన్ని తాను అసాధారణమైన వర్ణనలతో ఒక వైపు చూస్తూ, ఇంకొకవైపు ఆ పక్కనే ఆమె ఏ ప్రత్యేకతా లేనిదని తీర్మానంగా చెబుతూ చివరిదాకా దానినే పాఠకుడిని నమ్మమంటాడు కథలో ‘నేను’! అదెలా కుదురుతుంది? కుదరదు గనుక  పాఠకుడు కుముదం ను మొదటినుంచీ అసాధారణ వ్యక్తి గానే గణించి, పరిగణిస్తూ వస్తాడు.

—- ‘పూర్తిగా పండని జామపండు రంగులా వుండేది ఆ పిల్ల ఛాయ.’

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ….  ఆమెని తొలిగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుతుంది.’

‘ఆమెలో కథావస్తువుగా వుండేటంతటి విశేషం ఒక్కటి కూడా లేదు.  చూడడానికి చాలా సామాన్యంగా వుంటుంది. పల్చటి శరీరం.  వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బురంగు శరీరఛ్ఛాయ.  సంపూర్ణంగా వికసించని అవయవాలు.  ఎవరో దువ్వినట్లుగా వుండే జడకట్టు.  చూసిన వస్తువులు తనకోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా వుండే పచ్చటి నాళాలు.  నీడ కనుపించినట్లు స్ఫురించే వక్షం.  శరీరంలో పై భాగాన్ని మోసేటందుకు వోపిక లేనట్టి అల్పమైన నడుం.  కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరూ తుదకు వాళ్ళమ్మకూడా ఆమె అందమైనదని చెప్పుకోవడం నేనెరగను.  అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేక పొయ్యానేమో!’

‘పోతపోసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్ళు ఆమెవి.  ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తంతా దానిలో పూరించినట్లుగా వుంటుంది.  ఒక వస్తువుకేసి చూస్తున్నప్పుడు, పంచ ప్రాణాలు కళ్ళల్లోకి పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది.  సిగ్గు పడితే రక్తం చెక్కిళ్ళలోనుంచి తొంగిచూస్తున్నట్లుంటుంది. కాని, కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథౌతుందా?’

‘నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను.  నిదానించి చూస్తే ఆమె మొహంలో వొక వింత ఆకర్షణ వుంది.  ఆమె శరీరంలో వొంపులు, ఎత్తు పల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చి నట్లుగా విప్పారుకున్నాయి.  ఆ కళ్ళు ఆమెకి ఉపయోగం లేవు కాబోలు.  మనుషులకు ఆత్మ వుందో, లేదో నాకు తెలీదు కాని, ఆమెకు మాత్రం లేనట్లు నాకనిపించింది.  మరో లోకంలో ఆత్మని మరచిపోయి, శరీరాన్ని తనిష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది.  ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరచుకొన్న నేత్రాలు ఆమెవి.’

‘కుముదం… … చీరని పాదాల పైకి తీసింది.  ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణత నిచ్చింది.  వయస్సు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా, వార్థక్యాన్నివ్వలేక పోయింది.  మట్టిలో నీళ్ళు కలిసిన వింత సువాసన నన్నావరించింది.  మొహాన్ని పమిటతో తుడుచుకుంది.  తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు, వక్షాన్ని అదిమి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని వొక్కసారి వెలిగించి మాయమైంది.  సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో వుండాలి.  సంధ్యలో నేనెన్నడూ చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను.’ —-

కథా గమనంలో కుముదం ను గురించిన వర్ణన ఇక్కడికి చేరుకునేటప్పటికి. ఆమెపై భావచిత్రణ peak కు చేరినట్లై, ఆమె చుట్టూ ఒక అసాధారణమైన aura ను సృష్టించి వదులుతుంది. ఒక వైపు ఇంత వర్ణన చేస్తూనే, కథలో ‘నేను’ మాత్రం ఆమె అప్పటికీ ఏ ప్రత్యేకతలూ లేని స్త్రీనే అనే అభిప్రాయానికే బధ్ధుడై వుంటాడు. ఇది ఒక paradox, రచయిత కావాలని conscious గా సృష్టించిన paradox! ఈ paradoxical situation ని పాఠకుడు గమనించే పరిస్థితిలో వుండడు. వూపిరి సలపనీయనట్లు వుండే, అసాధారణమైన ఆ powerful imagery లో, వర్ణనలలో పడి కొట్టుకు పోతూ వుంటాడు. (ఈ paradox యే కథ ముగింపును decide చేసిందనీ, కథ dramatic గా ముగియడానికి కారణమయ్యిందనీ అనిపిస్తుంది.)

ఇంత powerful imagery తో కుముదం ను ఆ స్థాయికి తెచ్చి కూర్చో బెట్టిన తరువాత – ఇక ఇప్పుడు ఏమిటి? అన్నది  ప్రశ్న. What to do with her? And, what to do with him? అన్నవి కూడా కథ ముందుకు నడవడానికి సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు.

ఆమెను glorify చెయ్యడానికి ఇంక మిగిలిన మాటలు లేవు.
అతని గురించి ఇక చెయ్యగలిగింది లేదు.

ఈ స్థితిలో, కథ లేని చోట కథను ఏలా ముందుకు నడిపించాలి, ఎలా ముగించాలి? అన్న సమస్య ఎదురైన ఇప్పుడు, రెండు possibilities:

ఒకటి – He had to change…అతను మారాలి.  ఇది పొసగదు.
రెండు – She had to cease…cease to exist… ఆమె మరణించాలి.

మరణం ఎందుకు? అంటే, మరణంలో వ్యక్తి ప్రదీప్తుడవుతాడు గనుక. కుముదం మరింతగా ప్రదీప్తితమౌతుంది గనుక! ఇంతకంటే, dramatic గా జరిగిన  కుముదం మరణానికి వేరే కారణం ఊహించలేము. Her death was the indirect result of the unbearable wieght of the aura created around her!

అయితే, ఇందులోనే మరో dramatic situation, చనిపోతూ కుముదం  కథలో ‘నేను’ పెళ్ళిచేసుకోకపోవడానికి సంబంధించి చెప్పిన మాటలు, దానిపై  విశ్లేషణ చేసుకుంటూ, ‘ఆమె కోసం నేను పెండ్లి చేసుకోలేదట’ అని కథలో ‘నేను’ చేసిన వ్యాఖ్య, ఆపై ఫ్రాయిడ్ ‘సుప్త చేతన’ ఆలంబన….ఇవన్నీ ఒకదానికొకటి making up గా చేరిన సంగతులు అనిపిస్తాయి. ఈ విశ్లేషణతో పాఠకుడు identify అవలేడు. ఈ విశ్లేషణతోనే కాదు, కుముదం చివరి మాటలతోనే పాఠకుడు identify అవలేడు; కారణం ఒకటే – ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అన్ని రోజులు ఆగదామె!

ఏదేమైనా, బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథ మొదటే చెప్పుకున్నట్లుగా రెండు కారణాలవల్ల గొప్ప కథ. అవి narration and inquiry అనేవి! narration గురించి వేరే చేప్పేదేమీ లేదు, ఇప్పటిదాకా చెప్పుకుందదే కాబట్టి.

ఇక రెండవది – inquiry- అవును. Surface level లో మూసలో పోసినట్లు అంతా ఒకే రకంగా unbearably absurd గానే కనిపిస్తాయి. అయితే, things continue to happen out of this absurdity only అనేది సత్యం! కాకపోతే, చూడగలిగే కన్నూ, పట్టుకోగలిగే మనసూ వుండాలి. One needs to have the eye to look and the brains to pick! అన్నది కథలో దొరికే సమాధానం!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-1

బుచ్చిబాబు (జూన్ 1916 – సెప్టెంబరు 1967)

కథనం స్థూలంగా రెండు రకాలు. ఒకటి naration – ఎక్కువ వర్ణనలతో పని పెట్టుకోకుండా కథను చెప్పుకుంటూ పోవడం; రెండు inquiry – కథను చెబుతున్నట్లుగానే చెబుతూ అంతః సూత్రంగా ఒక ప్రశ్నను లేవనెత్తి, విశ్లేషించే ప్రయతం చేసి, వీలయితే సమాధానాన్ని సూచించడం, లేదా చెప్పడం.

కథా వస్తువు (subject) ను బట్టి, ఈ రెండింటిలో ఏది ప్రధానమై వుండాలన్నది నిర్ణయమై వుంటుంది. అయితే, enquiey అనేది లేకుండా కేవలం narration తోనే గొప్ప కథ తయారవడానికి ఆస్కారం వుంది గాని, సరయిన narraation లేకుండా కేవలం inquiry తోనే గొప్ప కథ తయారవుతుందనడానికి నిదర్శనాలు సున్న. కారణం, సరయిన narration లేకుండా కథ లేదు.

బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ – great narration as well as enquiry, both at the same time! అందువలన ఆ కథ తెలుగులో అత్యుత్తమ కథానికలలో ఒకటిగా మన్ననలందుకుని నిలిచింది.

మనలో చాలా మధ్య తరగతి జీవితాలు పుట్టుకనుంచి గిట్టేదాకా మూసపోసినట్లు ఒకేరకంగా, కొత్తదనమేమీ లేకుండా, unbearably absurd గా వుంటాయి – ఇది ఆ కథలో enquiry! అవును? కాదు? – కథలో ప్రధాన పాత్రలైన ఇద్దరిలో ఒకరు ‘నేను’ దృష్టిలో ‘అవును!’; రెండవ పాత్ర అయిన కుముదం దృష్టిలో ‘కాదు. అలా అనుకోవడానికి వీల్లేదు. that is a wrong notion!’

‘ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో ఒప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడే చచ్చిపోవడం. ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి.  కాని, అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతం’ – అని కథలో ‘నేను’. He was unclear, unrealistic, too emotional and idealistic!

‘ఏమీ లేదు. నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడం లేదు. నే చదువుకున్న దాన్ని కాదు. ఉండు, ఆలోచించనీ…’

‘కానీ….కానీ…సుర్యుడూ, చంద్రుడూ ఎప్పుడూ చూస్తూంటాను. కాని, ప్రతిసారి ఎందుకో క్రొత్తగా కనబడతాయి.  మంచినీళ్ళు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో క్రొత్తగా వుంటాయి…నక్షత్రాలు…’

‘ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు.  నేను అనుభవిస్తాను. ఏమో’ – అని కుముదం. She was clear in her thought, realistic, reasonably emotional and focused!

1945-46 ప్రాంతాలలో వ్రాసిన కథ ఇది. కథలోని ‘నేను’ లో బుచ్చిబాబు తనకు తానుగా లేడనుకోవడానికి వీలు లేకుండా వుంటుంది పాత్ర చిత్రణ. బుచ్చిబాబు ఈ కథ వ్రాసే నాటికి 30 సంవత్సరాల వయసులో వున్నారు.

కథలో ‘నేను’ కు ఇరవై యేళ్ళ వయసులో కథ మొదలవుతుంది. కుముదానికి పద్దెనిమిదేళ్ళు. అప్పటికే పెళ్ళి అయింది. కథ అంతమయే నాటికి ‘నేను’ ముఫ్ఫై నాలుగేళ్ళ వయసు వాడు. అప్పటికీ అవివాహితుడూ. కుముదం ముఫ్ఫై రెండేళ్ళ వయసులో వుంటుంది. కనుక, కథ నడిచిన కాలం పధ్నాలుగేళ్ళు.

కథ అంతంలో, కుముదం న్యుమోనియ జబ్బుతో హాస్పిటలులో మంచం పై చావుబ్రతుకుల మధ్య వుండగా చూడడానికి వెళ్ళిన అతను ‘అనుకోకుండా’ తన చేతిని ఆమె చేతిపై ఆనించబోగా, వెంటనే చేతిని లాగేసుకుని దుప్పటిలో దాచేసుకుని ‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం.’ అంటుంది.

‘నీ స్థితి నాకెంతో బాధగా వుంది’ అంటాడతను కన్నీరు దగమింగుకుని.
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ అని కళ్ళు మూసి మరివిప్పదు కుముదం.

కుముదం ఈ మాటలు కథలో ‘నేను’ కు ఒక revealation! ఈ revealation కథలో ‘నేను’ యొక్క ప్రపంచాన్ని తల క్రిందులు చేసి అతని జీవిత పరమావధినే తారుమారు చేస్తుంది. అదే కుముదం సాధించిన విజయం, అదే ఆమె ప్రత్యేకత. కుముదంలోని ఈ ప్రత్యేకతే (కథలో ‘నేను’ చేత) ఆమె గురించి కథ వ్రాయించేలా చేస్తుంది.

కథాంతంలో కుముదం మాటలవలన జరిగిన ఈ revealation రెండు విషయాలను సుచిస్తుంది:
ఒకటి – కుముదం ‘అతడు తనను ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో వుంది, మొదటినుంచీ.
రెండు – అతడు ‘తాను కుముదాన్ని ప్రేమిస్తున్నాను’ అనుకోలేదు ఎప్పుడూ.

ఈ confusion అసలుగా ఎవరిది? మొదటినుంచీ చూసుకుంటూ వస్తే:

తనకు పదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ చెప్పవూ?’ అంటుంది కుముదం.
తనకు పద్దెనిమిదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ అంటుంది.

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి.

కుముదంపై ఈ పవిత్ర భావం అతనికి ఎప్పటిది? తాను ఇరవై యేండ్ల వయసప్పటిదా? లేక, (చివరలో ఆమె మాటల తరువాత) ఆమె మరణానంతరం, కథ వ్రాసే నాటికి కలిగినదా? అంటే, రెండింటిలోనూ పెద్ద తేడా లేదనిపించొచ్చు గాని, ఆమె మరణం తరువాత కలిగిన ఈ పవిత్రతా భావాన్ని తన ఇరవై ఏండ్ల వయసప్పటి స్థితికి కూడా ఆపాదించుకున్నట్లుగా అనిపిస్తుంది కథాగమనంలో ఈ వ్యాఖ్య చేసిన చోటు.

కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం a born intellectual లా కనిపిస్తంది ఆమె మాటలలో.

‘….మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’

‘…ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’

‘నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను.   మొదట ఏ పదిమంది పొలం కాపులో వస్తారు.  సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాళ్ళు చదువుకోసం వస్తారు.  ఉత్త చేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు అలా నాక్కావల్సిన వాటిని వాళ్ళే సిధ్ధం చేస్తారు.  వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకు తీర్పు చెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను.’ – ఇదీ కుముదం మాటలలోనే కుముదం.

సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఉద్యోగం సద్యోగం లేకుండా unrealistic idealism లాంటి దేనిలోనో కొట్టుకుపోతూ నేల విడిచి సాముకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించే అతని జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది కుముదం. దీనిని ఏమనాలి? ఇప్పుడున్న సంకుచితార్ధంలో ‘ప్రేమ’ అనుకోలేం. దానికంటే మించినది, వేరే మాట కావాలి.

అతడు కుముదం మాటలను అర్ధవంతమైనవిగా ఖాతరు చెయ్యడు, పట్టించుకోడు. కథ చివరిదాకా కూడా అదే పరిస్థితిలో ఉంటాడు తప్ప మార్పేమీ వుండదు.

అలా వచ్చి, చివరి సన్నివేశంలో, చేయి స్పృసించబోతాడు. కుముదం అంగీకరించదు.
ఇక అదే ఆఖరి ప్రయత్నంగా, ఒక shock treatment లా –

‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం.’
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ మాట పూర్తికాకుండానే కళ్ళు మూస్తుంది.

ఈ shock treatment ఫలితంగా – చివరికి ఆమె ఆశించింది జరిగిందనడాన్ని కథాంత వాక్యంలో ‘నా ప్రపంచాన్ని తలక్రిందులుచేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?’ అన్న మాటలు సూచిస్తాయి.

ఈ వాక్యానికి ముందు, కథలో ‘నేను’ , తాను కుముదం చేతిని అనుకోకుండా స్పృశించబోవడాన్ని, ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిధ్ధాంతంలోని ‘సుప్త చేతన’  నేపధ్యంలో విశ్లేషణ చేస్తూ – ‘ఇంతకాలం నా బుధ్ధి వాటిని (కుముదంపై ప్రేమ సంబంధ భావనలను) కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుధ్ధిని తొలగించి వాంచలు బైటికొచ్చినట్లు కుముదం గ్రహించి, తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా, ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి వుండి, నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను’ – అని explanation యిస్తాడు.(కుండలీకరణం లోని మాటలు నావి).

అయితే, ఒక స్త్రీ పై పురుషుని ప్రేమ భావనలు ఇంత ‘సుప్తం’ గా వుండగలవా? అన్నది ఇక్కడ పుట్టుకొచ్చే ప్రశ్న.
దీనికి సమాధానం ‘అవును’ అన్నదయితే, అది నమ్మశక్యంగానట్లుగా వుండి convincing గా ఒప్పుకోలేము.
‘కాదు’ అయితే, ఈ explanation కథలో ‘నేను’ ఆ చర్యను convincing గా సమర్ధించేదిలా అనిపించదు. అప్పుడు వారిద్దరూ వున్న పరిస్థతిలో, చాలా సహజమైన సానుభూతి ఫలితమైన ఆ చర్యను సమర్ధించడానికి ‘సుప్త చేతన’ ను తోడు తెచ్చుకోవాలా? అన్న సందేహాన్ని రేపుతుంది.